సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ నియోజకవర్గం వేపల మాదరం గ్రామానికి చెందిన ఖాసీం సాయబ్ సైదాబి గార్ల పుత్రిక ఖతిజుల్ కుబురా షాది వేడుకలో ముఖ్య అతిధిగా హుజుర్ నగర్ నియోజకవర్గ యువ నాయకుడు పిల్లుట్ల రఘు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వధువు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నా కూతురి వివాహ వేడుకలో రఘు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కార్య కర్తలకు మీరు ఎపుడు అండగా నిలబడి కుటుంబ పెద్దగా మాకు సహకరించాలి అని కోరడం జరిగింది. అనంతరం రఘు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మీ అందరికి అండగా ఉంటామని ఆరోగ్య బాధ్యత నాదేనని మీ పిల్లోడి చదువుకు అండగా నిలుస్తా అని ప్రతి నిరుపేద అడబిడ్డ పెళ్ళికి 25,000 రూపాయలు నా స్వంతంగా అందిస్తా అని చెప్పడం జరిగింది ఈ కార్య క్రమంలో ఇంచార్జి కుక్కల వెంకన్న కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin