Tuesday, 15 September 2026 07:58:02 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ తోనే సుస్థిర అభివృద్ధి... - టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్.

Date : 06 August 2023 06:47 AM Views : 390

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కాంగ్రెస్ పార్టీతోనే పట్టణంలో సుస్థిర అభివృద్ధి సాధ్యపడుతుందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల 19, 20, 21, వార్డులలో శనివారం బస్తి బాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఇప్పటికే రైతు, యూత్‌, భూమి డిక్లరేషన్లను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిందని అన్నారు. వీటిలో రూ.2 లక్షల రుణమాఫీ, కౌలు రైతు లకు రూ.15 వేల పెట్టబడి, ఉపాధి హామీ పథకంలో ని రైతు కూలీలకు రూ.12 వేలు ఆర్థిక సాయం, ధరణి పోర్టల్‌ రద్దు, పోడు భూములు క్రయ విక్రయాలు చేసేలా హక్కులు కల్పించడం తో పాటు- అన్ని పంట లకు మద్ధతు ధర, రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టబద్ధమైన రైతు కమిషన్‌ వంటివన్నీ డిక్లరేషన్లలో పొందుపరిచిందని పేర్కోన్నారు. అంతేగాక అమర వీరులకు రూ.25వేల పెన్షన్‌, 2లక్షల ప్రభుత్వ ఉద్యో గాల భర్తీ, నిరుద్యోగ యువకులకు నెలకు రూ.4వేల భృతి, యూత్‌ కమిషన్‌, రూ.10లక్షలు వడ్డీ లేని రుణా లు వంటివన్నీ ఇప్పటికే ప్రకటించిందనీ, దీంతో పాటు- మహిళా, మైనార్టీ, బీసీతో పాటు- మరిన్ని డిక్లరేషన్లను ఆ పార్టీ ఆగస్టు చివరి వరకు విడుదల చేయనున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కే. చెన్నయ్య, పిసిసి సభ్యులు బాబర్ ఖాన్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘు, మన్నె రవి, శబద్దీన్, నల్ల ముని శ్రీధర్, కొప్పాపురం ప్రవీణ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు నాగమణి, గణేష్, మైనార్టీ సెల్ హలీం సాకీబ్, గంగ మూవీ సత్తయ్య, యూత్ కాంగ్రెస్ ఖదీర్, ముబారక్, అందే శ్రీకాంత్, కిషోర్ యాదవ్, అహ్మద్ బాబా, హైదర్ గోరి, గణేష్ రాథోడ్, మాధవులు, అశోక్, నవీన్, అక్కి గారి శ్రీధర్, రుస్తుంగిరి, శేఖర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :