సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం గోదావరి బ్రిడ్జి కింద మొదటి పిల్లర్ పక్కన ఓ గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. దీంతో భద్రాచలం పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇతని గురించి ఎవరికైనా ఏమైనా వివరాలు తెలిసినట్లయితే భద్రాచలం టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబరుకు 9440795320 సమాచారం అందించాలని కోరారు.
-----------------------
Admin