సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : మెట్రో రాకతో షాద్ నగర్ అభివృద్ధిలో మరింత ముందుకు సాగనుందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. హైదరాబాద్ నుండి శంషాబాద్, కొత్తూర్ మీదుగా షాద్ నగర్ వరకు మెట్రో ఏర్పాటు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల నందిగామ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మెట్రో విస్తరణలో భాగంగా షాద్ నగర్ వరకు మెట్రో ఏర్పాటు నిర్ణయం హర్షించదగ్గ విషయం అన్నారు. మెట్రో ఏర్పాటు అటు ప్రజలకు ఇటు ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మెట్రో ఏర్పాటుతో షాద్ నగర్ మెట్రో నగరంగా ఏర్పడనుందని సంతోషం వ్యక్తం చేశారు. మెట్రో ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.
-----------------------
Admin