Wednesday, 29 July 2026 03:58:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం...

Date : 17 December 2024 11:20 PM Views : 573

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : బి.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజి మంత్రివర్యులు కేటీఆర్ పిలుపుమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల సద్భుద్ది ప్రసాదించాలని . అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించిన తాజా మాజీ ఎమ్మెల్యే & మిర్యాలగూడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నల్లమోతు భాస్కర్ రావు మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే మిర్యాలగూడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ కొడంగల్ లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారి పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. గిరిజన రైతుల చేతికి బేడీలా లగచర్ల రైతుకు సంకెళ్ళు.. ఈ ప్రభుత్వం కు సిగ్గుoడాలి లగచర్ల రైతులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అనంతరం సాగర్ రోడ్డు రైతు బజార్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మిర్యాలగూడ నియోజకవర్గ పార్టీ అధ్యక్షులు నల్లమోతు భాస్కర్ రావు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీ.సీ.ఎం.ఎస్ నల్లగొండ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, నల్గొండ జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా మాజీ కో-ఆప్షన్ మెంబర్ మోషన్ అలీ, మాజీ ఏఎంసీ ఛైర్మన్ లు ధనావత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి, పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి,మట్టపల్లి సైదయ్య యాదవ్, ఏఎంసీ మాజీ వైస్ ఛైర్మన్ కుందూరు వీర కోటిరెడ్డి, తాజా మాజీ జెడ్పీటీసీ ఆంగోతు లలిత హాతిరాం నాయక్, తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :