Monday, 14 September 2026 06:57:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వాంతులు, విరోచనాలు ప్రబలకుండా కాచి చల్లారిన నీళ్లు తాగాలి... -10వ వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ

Date : 30 July 2023 02:54 AM Views : 480

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (మున్సిపాలిటీ ):సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ వార్డుల్లో ముందస్తుగా తక్షణ చర్యలు చేపట్టాలని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ అధికారులకు విజ్ఞప్తి చేశారు. శనివారం పదో వార్డ్ లో పర్యటించి ఆమె మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా వారం రోజుల నుండి కురిసిన వర్షాల కారణంగా నిల్వ ఉన్న మురికి నీటిలో దోమలు, క్రిమి కీటకాలు వ్యాప్తి చెంది డెంగ్యూ ,మలేరియా, చికెన్ గున్యా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అన్నారు. శుభ్రత లేని మంచినీళ్ల వల్ల వాంతులు ,విరోచనాలు మరియు విష జ్వరాల ప్రభలే ప్రమాదం ఉందని ,తక్షణమే యుద్ధ ప్రాతిపదికన విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ అధికారులకు విజ్ఞప్తి చేశారు . అలాగే వార్డులోని అన్ని కాలువలను శుభ్రపరిచి దోమల మందు పిచికారి చేయాలని మురికిగుంటలు ఉన్న ఏరియాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని అలాగే దోమల పాగింగ్ చేసి విష జ్వరాల నుండి ప్రజలను కాపాడాలని అలాగే శుభ్రపరచిన కిన్నెరసాని మంచినీళ్లు అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూడా చైతన్యమై ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకొని కొబ్బరి బోండాలు, చిప్పలు, టైర్లు, కూలర్లలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని తద్వారా మానారోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళము అవుతామని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తునికి పాటి పరిపూర్ణ చారి ,ముద్దం మార్తమ్మ ,తునికి పాటి రత్నకుమారి ,ఎలిశమ్మ, చిలకలూరి సుప్రియ, ముంతాజ్, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :