Saturday, 12 September 2026 08:14:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమే.... - మాజీ మంత్రి పల్లె

Date : 10 July 2023 06:44 AM Views : 557

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గంలో ఆదివారం సైతం నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేసిన మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి . అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షమే అని నిరూపించుకునే మాజీ మంత్రి , పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి పల్లె రఘునాథ రెడ్డి తనదైన శైలిలో నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేపడుతున్నారు.ఆదివారం సైతం యధాతధంగా ఉదయం నుంచే కష్టాల్లో ఉన్న కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు. వారి యోగక్షేమాలు తెలుసుకొని వారికి ఆర్ధిక సాయం అందిస్తూ ముందుకు కదిలారు.పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కర్ణాటక నాగే పల్లి నందు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న శ్రీనివాసులు నివాసంలో అయన యోగక్షేమాలు తెలుసుకొని ఆర్థిక సాయం అందించారు.అనంతరం శ్వాసకోశ ఇబ్బందికి గురైన కే రమణ నివాసంలో ఆయనను పరామర్శించి ఆర్ధిక సాయం అందించారు.ఆ ప్రాంతంలో వంట మాస్టర్ గా పేరు గాంచి నిన్నటి రోజున మరణించిన జీమాను రామయ్య కుటుంబసభ్యులును పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ ఆర్ధిక సాయం అందించారు. మార్గ మధ్యలో విధుల్లో ఉన్న పుట్టపర్తి పారిశుధ్య కార్మికులతో ముచ్చటించారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వారి కష్టానికి తగిన విధంగా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.ఇటీవల గుండె చికత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న చెన్న కృష్ణ నివాసంలో అయన ఆరోగ్య వివరాలు తెలుసుకొని, కుటుంబసభ్యుల యోగక్షమాలను తెలుసుకున్నారు. అనంతరం ఓబులదేవర మండల పర్యటనలో చింతమాని పల్లి లో టీడీపీ కార్యకర్త కుటుంబం లో జరిగిన దిన కర్మ కు హాజరయ్యారు. ఆ పంచాయితీ లో టీడీపీ కార్యకర్తల ను పరామర్శించారు. కొండక మార్ల లో పర్యటించారు. కదిరి లో ఓబులదేవర చెరువు మండల టీడీపీ కి చెందిన ఓ మైనార్టీ కార్యకర్త కుటుంబంలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. అలాగే అమడగూరు మండలం లో పర్యటించారు. ఓబులదేవర చెరువు మండలం వేమారెడ్డి పల్లి లో పాత్రికేయుడు బుద్దల గోపీనాథ్ రెడ్డి కుమార్తె ను పరామర్శించారు. కార్యక్రమంలో ఓబుల దేవర చెరువు మండల కన్వీనర్ జయచంద్ర , శివారెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: