సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కొంచెం కష్టపడితే షాద్ నగర్ అసెంబ్లీలో ఫలితం సింహం గుర్తుదేనని ఆ పార్టీ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. షాద్ నగర్ నియోజకవర్గం లోని చౌదరి గూడ, కొందుర్గు, కొత్తూరు, కేశంపేట్ మండలాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఈ కార్యక్రమాలకు హాజరై కార్యకర్తలకు సూచన సలహాలు చెయడం జరిగింది. కొంచెం కష్టపడితే ఫలితం మనదే కాబట్టి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి మనం చేసిన ప్రతి కార్యక్రమం ప్రతి గడప కు చేరాలని అన్నారు. ప్రజల్లో ఉన్నాము కాబట్టి మనం గెలిస్తే మనం చేసే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. గ్రామాల్లోకి ఎన్నికలప్పుడే మళ్ళి మళ్ళీ మాయగాలు వచ్చి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తారానే విషయం ప్రజలకు వివరించాలని కోరారు. మనం చేసే కార్యక్రమాలే మనకు ఆశీర్వాదం అని అన్నారు. కార్యకర్తలకు ఏ ఇబ్బంది ఎదురైనా నాకు సమాచారం అందించాలని కోరారు.
-----------------------
Admin