సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు : గత సంవత్సరం క్రితం న్యూఢిల్లీ నుండి ఒక కేంద్రమంత్రి కార్యాలయం నుండి BSSM తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామెలు పేరుమీద బూర్గంపాడు మండలంలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీ, చింతకుంట, రాజీవ్ నగర్ కాలనీ ఎస్టీ కాలనీకి రోడ్ల నిర్మాణం చేపట్టాలని అంగన్వాడి స్కూల్ మంజూరు చేయాలని సదుపాయం పలు మౌలిక వసతులు కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ లేఖ రాయించడం జరిగింది. జిల్లా కలెక్టర్ స్పందించి ఐటీడీఏ పిఓ , ఆర్డీవో , డిపిఓ లేఖ రాయడం జరిగింది. ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు ఊరిలోకి వెళ్లి పరిశీలించిన అధికారులు లేరు. పోయిన వర్ష కాలంలో సరైన రోడ్లు, వైద్య సదుపాయాలు లేక ఇద్దరూ పసి పిల్లలు దారిలోనే మరణించారు. ఆదివాసీలు నివాసం ఉంటున్న ప్రాంతంలో వారికి పక్కా ఇల్లు రోడ్లు పలు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర BSSM కార్యదర్శి ఇస్రం శ్రీనివాసరావు, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జి గార్లపాటి సుధాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే వి ఆర్ మూర్తి మరియు స్థానిక గిరిజనులు పాల్గొన్నారు.
-----------------------
Admin