సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : కాజీపేట ఫాతిమా నగర్ లోని MONT FORT CBSE పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పెండ్యాల లక్ష్మి ప్రియ హైదరాబాద్ CCRT భవన్ లో జరిగిన రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ సంకలనం 2022 కార్యక్రమంలో అన్ని రకాల శాస్త్రీయ నృత్యాలలో మొదటి బహుమతి పొంది మరియు న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయికి ఎంపిక అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని MONT FORT CBSE పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ పోలిశెట్టి అంథోని గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుండి మొదటి బహుమతికి మన పాఠశాల విద్యార్థి ఎంపిక అవటం మన అందరికి ఎంతో అర్షనీయం గర్వకారణం, లక్ష్మి ప్రియకు కూచిపూడి నాట్యం లో 5సంవత్సరాలు గా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దిన గురువు సుధీర్ రావు గారి మరియు అనునిత్యం తనకు ప్రోత్సాన్ని అందిస్తున్న తల్లిదండ్రులకు పాఠశాల తరఫున బ్రదర్ అంతోని గారు అభినందనలు తెలియజేశారు, కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు....
-----------------------
Admin