సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : కృష్ణ మండలం, ఖాన్ దొడ్డి గ్రామంలో రోజూ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో భగీరథ డిపార్ట్మెంట్కు చెందిన DE శ్రీనివాస్, AE శ్రీకాంత్ లు పాల్గొని గ్రామంలోని త్రాగునీటి సరఫరా పరిస్థితులను సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా గ్రామానికి నూతనంగా అవసరమైన నీటి ట్యాబుల ఏర్పాటు, పాడైపోయిన పైప్లైన్ల మరమ్మత్తులు, అలాగే నిరంతర నీటి సరఫరా కోసం తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చ జరిపారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా అధికారులు శ్రద్ధగా విని వాటిని త్వర త్వరగా తొందరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సంగోళ్ళ వెంకటేష్, ఉపసర్పంచ్ దుకాణం శ్రీనివాస్, వెంకటేష్, మల్లప్ప, లచ్చప్ప, కృష్ణ మండలం యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తారేష్ , గ్రామ పెద్దలు మరియు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin