సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : బుధవారం గీసుగోండ మండలంలోని కొనయమాకుల రైతువేదికలో గీసుగోండ మండలం మరియు 15,16 డివిజన్ల పరిధిలోని గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...46 మంది లబ్ధిదారులకు 46 లక్షల 5వేల 336 రూ విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను మరియు 35 మంది లబ్ధిదారులకు 16 లక్షల 20 వేల రూపాయల విలువగల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వ పాలకులు ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు.పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణి లక్ష్మీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ చీరల పంపిణీ,200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు రూ 500 బోనస్, మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ, వడ్డీ లేని రుణాలు, శ్రీనిధి రుణాలు, ఇందిరమ్మ ఇల్లు,తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
-----------------------
Reporter