Monday, 14 September 2026 02:41:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామ పంచాయతీ కార్మికులు కొత్తగూడెం ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా...

Date : 19 July 2023 04:55 AM Views : 662

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె డిమాండ్లపై రాష్ట్ర JAC ఇచ్చిన పిలుపు మేరకు కొత్తగూడెం MLA శ్రీ వనమా వెంకటేశ్వరరావు ఇంటి ముందు ధర్నా నిర్వహించి,JAC నాయకత్వం సామూహిక రాయభారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె డిమాండ్లను JAC చైర్మన్ ఎ.జె.రమేష్,AITUC జిల్లా అధ్యక్షులు నరాటి ప్రసాద్,సెక్రటరీ జనరల్ యూసఫ్, CITU జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవి,గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి మురళి లు స్థానిక శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు కి వివరిస్తూ గత 14 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని,కార్మికుల అడుగుతున్నవి గొంతెమ్మ కోర్కెలు కాదని,కనీస వేతనం 19 వేలు ఇవ్వాలని,ప్రమాద భీమా, పియఫ్,ఇయసై,పర్మినెంట్ తదితర 17 డిమాండ్ల పై రాష్ట్ర ప్రభుత్వానికి నెలన్నర క్రితమే తెలియజేసినప్పటికి,నేటి వరకు కనీస స్పందన లేదన్నారు.కరోనా లాంటి క్లిష్టమైన సందర్భం లో ప్రజల ప్రాణాలు కాపాడడం లో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు.ఇటువంటి కార్మికుల సమస్యలను పరిష్కరించకపొగా,పోటీ కార్మికులను తీసుకువచ్చి సమ్మె విచ్ఛిన్నం చేసేందుకు తీవ్రంగా సమ్మె మొదటి రోజు నుండే అధికారులతో ప్రభుత్వం చేయిస్తుందని అన్నారు.తక్షణమే రాష్ట్ర JAC ని చర్చలకు పిలవాలని,ఇందుకు శాసన సభ్యులుగా ఉన్న మీరు చొరవ తీసుకోవాలని,పోటీ కార్మికులను నివారించే పని జిల్లా పంచాయతీ అధికారి తో మాట్లాడాలని కోరారు. ఇందుకు స్పందించిన యం.ఎల్.ఎ వనమా మాట్లాడుతూ కార్మికుల సమస్యలు చాలా న్యాయమని,సమస్యల పరిష్కారానికి మంత్రి తో మాట్లాడతానని హామీ ఇవ్వడమే కాక జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కి ఫోన్ చేసి సమ్మె ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయవద్దని,పోటీ కార్మికులను పెట్టీ వీరి పొట్ట కొట్టద్దని,పర్మినెంట్ వర్కర్ల తో తప్ప మిగతా వారిని తెచ్చి అసలు కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు అని తెలియ జేశారు.కార్మికుల కోసం అవసరమైతే సమ్మె టెంట్ లోకి వచ్చి కూర్చుంటానని కార్మికులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా JAC నాయకులు అమర్నాథ్,కిషోర్ కుమార్,జాడి సురేష్ కుమార్,వెంకన్న,లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: