సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబడిన అమ్మ వారి వీధిలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత వెన్నుకోబడిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నూతనంగా నిర్మించబడిన సబ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయాన్ని భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ. నేడు మన ఎర్రగొండపాలెం లో సబ్ పోస్ట్ ఆఫీస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ సబ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం సేవలను వినియోగించుకోవాలని అలాగే పోస్ట్ ఆఫీస్ అధికారులు కూడా ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రజల మనసులో నుంచి వచ్చిన మాట, అధికారులారా ఇది కదా ప్రోటోకాల్ అంటే, అది మరచి అధికారం ఎటువంటి అటు గడ్డి కరవడం అధికారులకు అలవాటైపోయింది. దయచేసి ఇకనుండి అయినా ప్రోటోకాల్ పాటించండి మీ గౌరవాన్ని పెంచుకోండి. ప్రజలతో, ప్రజల చేత ఎన్నుకోబడిన వారికి గౌరవం ఇవ్వండి. అని ప్రజల్లో చర్చలు మొదలైనవి. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం ప్రాంతంలో విలేకరులుగా పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు హాస్టల్ వ్యవస్థ ద్వారా యాక్సిడెంట్ బీమా పాలసీని అందిస్తానని దానికి అయ్యే ఖర్చు నేనే బరాయిస్తానని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం జడ్పిటిసి చేదురి విజయ భాస్కర్, ఎర్రగొండపాలెం మండల ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్, సర్పంచి అరుణ భాయ్, పోస్ట్ ఆఫీస్ అధికారులు, నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin