సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : కంబాలపల్లి గ్రామానికి చెందిన పలువురు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం అని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.సోమవారం కంబాలపల్లి గ్రామానికి చెందిన వారు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డా వారిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....మెరుగైన వైద్య సేవలు అందించాలి అని ఆయన సూచించారు. ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి LOC ఇపిస్తామని హామీ ఇచ్చారు.ఆయన వెంట టిఆర్ఎస్ పార్టీ చందంపేట మండల అధ్యక్షుడు ముత్యాల సర్వయ్య,టిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు,టిఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు బోడ్డుపల్లి కృష్ణ,టిఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్,హరిక్రిష్ణ తదితరులు ఉన్నారు.
-----------------------
Admin