సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి : రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన సభలలో అర్హులకు దరఖాస్తుల పంపిణీ చేయడం లో అధికారులు ఘోరం గా విఫలం అయినారని గరిడేపల్లి సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన గరిడేపల్లి మండల కేంద్రం లో విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలో అనేక గ్రామాలలో అర్హులైన వారికి దరఖాస్తులు అందక అప్లై చేసుకోలేక పోయినారని, కొత్త ప్రభుత్వానికి తమ కోర్కెలను దరఖాస్తులలో, తెలుపుకొని, నూతన ప్రభుత్వం నుండి సహాయం పొందాలని ప్రజలు వెయ్యి కళ్ళ తో ఎదురు చూస్తుంటే, వారికి అప్లికేషన్ పారాలు అందక నిరాశలో ఉన్నారని ఆయన అన్నారు. అర్హులు అందరికి వెంటనే దరఖాస్తు పారాలు సప్లై చేయాలని ఆయన అధికారులను కోరారు.
-----------------------
Admin