సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ గుప్తా గారి ఆదేశాల మేరకు రేపు అనగా తేది 30.09.2023 శనివారం హైదరాబాద్ లో ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ లో నిర్వహిస్తున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్ష కు అన్ని జిల్లాలనుండి, మండలాల నుండి పెద్దఎత్తున తరలి వచ్చి ఆర్యవైశ్య సాధన దీక్ష ను విజయవంతం చేయాలనీ రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య ప్రధాన కార్యదర్శి గందే సురేష్ పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ఆర్యవైష్యులలో ఎంతోమంది పేదవారికి, ఆర్థికంగా వెనుకబడిన వారి కొరకు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందరికి అందరికి అన్ని రంగాల్లో అభివృద్ధి సాదించాలన్న సంకల్పం తో ఈ సాధన దీక్ష ఉద్దేశం అన్నారు. గత పాలకులకు ఎన్నోసార్లు ఆర్యవైశ్యుల కొరకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ కోరినప్పటికి స్పందించక పోవడం బాధాకరమని అన్నారు. కావున రేపు జరుగబోయే ఆర్యవైశ్య సాధన మహాసభ కు ప్రతి ఒక్క ఆర్యవైష్యులు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ అన్నారు. ఈ మీడియా సమావేశం లో రంగారెడ్డి జిల్లా యువజన సంఘము ప్రధాన కార్యదర్శి గుడుపల్లి వెంకటరమణ, పట్టణ ఆర్యవైశ్య మాజీ అధ్యక్షుడు ఎంసాని శ్రీనివాస్, పట్టణ యువజన సంఘము ఉపాధ్యక్షుడు దండు నవీన్, ఉప్పల్ శ్రీనివాస్, దాసరి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin