సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : టీ పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పటేల్ రమేష్ రెడ్డి, సూర్యాపేట లోని తన నివాసం లో పత్రికా విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ.... నిన్న ఖమ్మం లో తెలంగాణ జన గర్జన సభలో సూర్యాపేట మాజీ మార్కెట్ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా నాయకత్వం లో శనగని రాంబాబు, భాషపంపు భాస్కర్, నేరెళ్ల మధు, నంద్యాల నరేష్ రెడ్డి, దున్న బాబు, చిన్న వివిధ హోదాల్లో ఉన్న బి అర్ ఎస్ నాయకులు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి స్వాగతం పలుకుతూ, కాంగ్రెస్ పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందని అన్నారు..సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రాజా , జగదీశ్వర్ రెడ్డి కుఠిల మరియు అవినీతి రాజకీయాలను తాళలేక మరియు తెలంగాణ ఉద్యమం లో చురుకైన పాత్ర పోషించిన భాషాపంగు భాస్కర్ తదితరులు జగదీశ్వర్ రెడ్డి గెలుపుకు పాటుపడినారు. తెలంగాణ సెంటిమెంటు తో స్థానికేతరుడు అయినప్పటికీ, రెండుసార్లు సూర్యాపేట నుండి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి, సూర్యాపేట ప్రాంతానికి చేసింది ఏమి లేదని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆత్మకూరు మండలంలో ప్రభుత్వ ధనంతో క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తూ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఫోటోలు క్రికెట్ కిట్ల మీద ముద్రించికుంటున్నాడు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి అహంకారానికి నిదర్శనం ఇది!! కాంగ్రెస్ పార్టీలో చేరికతో సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడి.. ఈసారి జగదీశ్వర్ రెడ్డి ని 50,000 పైచిలుకు మెజార్టీతో ఓడించి నాగారం పంపించడం ఖాయం..!! పటేల్ రమేష్ రెడ్డి తో పాటు పెద్దిరెడ్డి రాజా, భాష పంగు భాస్కర్, నేరెళ్ల మధు,నంద్యాల నరేష్ రెడ్డి, చిన్న, దున్న బాబు తదితర నాయకులు పాల్గొన్నారు..!
-----------------------
Admin