సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలుల బీబత్సం తో భయానక వాతావరణం ఏర్పడింది. గాలుల కు తొడ భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింప చేసింది. గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్థంబాల పై కూలాయి. బస్టాండ్ సెంటర్ లో భారీ వృక్షం కూలీ నాలుగు కార్లు దెబ్బతిన్నాయి. సింగరేణి ట్రాన్సిట్ గెస్ట్ హౌస్ లో సెల్ టవర్ డ్వంసం అయింది. బాబూ క్యాంప్ లో భారీ హార్డింగ్ నెలకూలింది. టిప్పర్ పై పడటం తో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరా నిలిచి పోవటంతో కొత్తగూడెం అంధకారం గా మారింది. వడ గాలుల ఉదృతి నేపథ్యం లో ఒకసారి గా మేఘా వృతం తో చల్లబడ్డాక జనం ఊపిరి పీల్చుకున్న తరుణం లో భారీ ఈదురు గాలులు పెను భీబాత్సాన్ని సృష్టించింది. రోడ్ల పై పడిన వృక్షాలను పోలీసులు , మున్సిపల్ సిబ్బంది యుద్ద ప్రాతిపాదికన తొలగించేందుకు కార్యాలు చేపట్టారు. రైల్వే అండర్ బ్రిడ్జి లో నీరు చేరి రాక పొకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారీ వర్షం తో కొత్తగూడెం లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
-----------------------
Admin