Wednesday, 29 July 2026 07:48:01 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గర్భిణీలందరు పౌష్టిక ఆహారం తీసుకోవాలి... -డాక్టర్ కమల్ రోహిత్

Date : 11 July 2023 03:07 AM Views : 424

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం లోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రధాన మంత్రి సురక్షిత మాతృ వందన అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద విచ్చేసిన గర్భిణీ లకు పౌష్టిక ఆహారం భోజన వసతి గత సంవత్సరoగా కదిరి రోటరీ క్లబ్ ప్రతినిధులు పృద్వి, రంజిత్ రాజు, వారిఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న గర్భిణీలందరూ పౌష్టికాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలియజేసినారు, ఈ సందర్భంగా ప్రాథమికఆరోగ్య లో భాగం గా డాక్టర్ వి. కమల్ రోహిత్ తగు సూచనలు, సలహాలు ఇస్తూ పౌష్టికహారం అవసరం, ప్రాముఖ్యత, పౌష్టికాహర విలువల ఆహార గుర్తింపు, వాడకం, రక్త హీనత నష్టాలు, ఆసుపత్రి సురక్షిత కాన్పు, ప్రభుత్వ పథకాలు, ప్రోత్సకాలు మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు.43 మంది గర్భవతులు వైద్య పరీక్షలు చేయగా 13 మంది కి హై రిస్క్ గుర్తించి వారికి ప్రత్యేక చికిత్స అందచేస్తూ మిగిలిన వారందరికీ అవసర పరీక్షలు, చికిత్స, ఉచిత మందుల పంపిణీ చేయడం జరిగింది. 13 మంది గర్భవతులకు ఉచిత స్కానింగ్ కొరకు సిఫార్సు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎం పి హెచ్ ఈ ఓ గఫూర్, పి హెచ్ ఎన్ దిల్షాద్, ఎం పి హెచ్ ఎస్, విజయ్ కుమారి, మురళీధరన్, ఫారంసిస్టర్ వరలక్ష్మి, ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లు,గర్భవతులు, ఆసుపత్రి సిబ్బంది, పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :