సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణం నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ రైతు బజార్ 960 గజాల స్థలాన్ని జీవో నెంబర్ 76 ను అడ్డుపెట్టుకొని అక్రమంగా కాజేసేందుకు యత్నించిన వారిపై ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్యే అభ్యర్ధి యెర్రా కామేష్ మండిపడ్డారు....ఈ మేరకు గురువారం రైతు బజార్ లో ఫ్లకార్డులతో నిరసన తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకొని 25వ వార్డు కౌన్సిలర్,ఆమె భర్త అదే విధంగా 11 వ వార్డు మాజీ కౌన్సిలర్ అతని భార్య రైతు బజార్ స్థలాన్ని,33వ వార్డు కౌన్సిలర్ భర్త గాజులరాజం బస్తీలో ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు స్కెచ్ వేశారని ఆరోపించారు.తప్పుడు పత్రాలు సృష్టించి ఇంటి పట్టా కొరకు దరఖాస్తు చేసుకున్న సదరు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు...తహశీల్దార్,ఆర్.డి.ఓ,కలెక్టర్ వరకు అందరికీ ఫిర్యాదు చేసిన నేటికీ చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు..రూ.13 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించెందుకు కబ్జాకు దరఖాస్తు చేసుకున్న వారు అధికార పార్టీ నాయకులు కావడంతో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తారని విమర్శించారు.వెంటనే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి,కోమలి,వినయ్,సోను,నాని తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin