సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని టౌన్ హాల్ నందు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గ కమిటీ ఎన్నిక నిర్వహించారు .నియోజకవర్గ కమిటీ ప్రధాన కార్యదర్శిగా సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా పయ్యావుల ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా గొట్టే ఆంజనేయులు, ప్రచార కార్యదర్శిగా బి కవిత, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పిల్లి ఆనంద్ కుమార్, జాయింట్ సెక్రటరీ గా నవీన్, హరి సింగ్, లింగయ్య,కోటేశ్వర రావు లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .వీరికి రాష్ట్ర అధ్యక్షులు గొట్టే నాగరాజు యాదవ్ నియామక పత్రాలు అందజేశారు .అనంతరం తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ 13 వ వార్షికోత్సవం సందర్భంగా కేకు కట్ చేసి మీటింగ్ కు వచ్చిన ప్రైవేట్ టీచర్లందరిని సన్మానించారు . ఇటీవల మరణించిన ప్రైవేట్ టీచర్ బట్టు అరుణ కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గొట్టే నాగరాజ్ యాదవ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు ప్రైవేటు టీచర్ల కోసం పోరాడాలని , అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గొట్టే నాగమణి,నర్సిరెడ్డి, ప్రమీల, శ్రీనివాస చారి, కృష్ణ, సైదులు, భగత్,కవిత, కోటేశ్వరి, సరిత, రాధిక, నాగజ్యోతి, ఇందిరా, గీత, రూతు, దివ్య మరియు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin