సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు చెరువుల పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. స్పెషల్ ఆఫీసర్ EAO జానసిన్ సుజాతన్ మాట్లాడుతూ... ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ఏర్పాటు సమయం నుండే సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన కాలేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రాజెక్టుల ద్వారా సాగునీరు పెరగడంతో కనివిని ఎరుగని రీతిలో పంట దిగుబడి పెరిగిందని చెప్పారు. ధాన్యము ఉత్పత్తిలో మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందని, నేడు మన రాష్ట్ర వ్యవసాయ విధానం, ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. గతంలో చెరువుల మరమ్మత్తుల కోసం ఏళ్ల తరబడి నాయకుల చుట్టూ కార్యాలయం చుట్టూ తిరిగేదని నేడు ఆ పరిస్థితి లేదని అన్నారు. రానున్న కాలంలో రైతులకు మేలు చేసే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రైతులకు అందుతాయని వివరించారు. ప్రతి ఊరికి స్మశాన వాటిక, రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలు ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎంపీడీఓ శ్రీధర్, ఎం పీ ఓ పావని, ఇరిగేషన్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి రమేష్, గ్రామ సర్పంచ్ అక్రమ్, ఎంపీటీసీ చిన్న రంగప్ప, విఆర్ఏ ఆంజనేయులు ఆశావర్కర్లు, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin