సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లో ఎండ తీవ్రత కు తట్టు కోలేక పట్టణం లోని 11 వ వార్డు హరిజన వాడకు చెందిన కస్తాల మహేష్ (45) అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు కస్తాల మహేష్ వేపల సింగారం రోడ్ లో ఉన్న ఎన్ సి ఎల్ ట్రాన్స్ పోర్ట్ లో సెక్యూరిటీ విభాగం లో పనిచేస్తున్నాడు. విధులు ముగించు కొని ఇంటికి వచ్చి తీవ్ర అలసట తో ఉండటం గమనించిన కుటుంబ సభ్యులు స్తానిక ప్రవైట్ ఆస్పత్రి కీ తలించారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం రిఫర్ చేయగా ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందారు. మృతుడు మహేష్ కీ బార్య పిల్లలు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మహేష్ ప్రభుత్వం ఆదుకోవాలని పలు ప్రజాసంఘాల నాయకులు కుటుంసభ్యులు కోరారు...
-----------------------
Admin