సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఎం ఏల్ సి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజుగా మేము భావిస్తున్నాం. హుజూర్ నగర్ టౌన్ హాల్ ముందు నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపారు.అనేక ఉద్యమాలు చేసిన కోదండరాం న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా గవర్నర్ కోటాలో రాష్ట్ర ప్రభుత్వం మరియు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత కూడా కుట్రపూరితంగా హైకోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన కెసిఆర్,కేటీఆర్ లను ప్రజలు క్షమించరు . రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కెసిఆర్ కుటుంబాన్ని రాజకీయ సమాధి చేయాలని యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది. గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు విచ్చలవిడిగా వందల వేల కోట్లు ఖర్చుపెట్టి బీ ఆర్ ఎస్ పార్టీ ఓడించింది . ఇప్పుడు కాంగ్రెస్ గౌరవించి ఎమ్మెల్సీ అవకాశమిస్తే ఈ రకంగా అడ్డుకొని కుట్రలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఎస్ బిక్షం నాయక్ విద్యార్థి జన సమితి రాష్ట్ర నాయకులు ముఖ్య మురళి ప్రజా గాయకుడు బాదే రామ నరసయ్య జి. సతీష్.డి. నాగరాజు ,కె సంతోష్ ఎం.చందర్రావు ఎం. శంకర్ పి.కళ్యాణి B.తిరుప ఎస్ కె.జరిన నిరుద్యోగులు పాల్గొన్నారు.
-----------------------
Admin