సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తా నగరంలో మహిళ డాక్టర్ అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాన్ ఎమర్జెన్సీ సేవలను ఒకరోజు బందు చేయాలని నిర్ణయించి అమలు చేస్తున్న సందర్భంగా ఐఎంఏ డాక్టర్ల బందుకు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ హుజూర్నగర్ డివిజన్ అధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ సంఘీభావం తెలియజేశారు. తక్షణమే ఇట్టి సంఘటనలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా వైద్యులకు రక్షణ కల్పించాలని అన్నారు.
-----------------------
Admin