Thursday, 30 July 2026 02:42:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గురుకుల కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఫలితాలలో రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం సాధించిన తాడువాయి వాసి...

Date : 17 February 2024 09:29 AM Views : 326

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మునగాల మండలం, తాడువాయి గ్రామానికి చెందిన జిల్లేపల్లి శోభన్ బాబు గురుకుల కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించాడు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి మీదుగా నియమక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రెండవ ర్యాంక్ సాధించిన శోభన్ బాబు మాట్లాడుతూ నేను ఈ స్థాయిలో ర్యాంకు రావడం పట్ల చాలా ఆనందంగాను, సంతోషంగాను ఉందని, ఈ స్థాయిలో రావడానికి నా తల్లిదండ్రులు జిల్లేపెల్లి వెంకటయ్య మైసమ్మ, నా అన్నదమ్ములు రవి సుమన్ ల సహకారం మరువలేనని, చిన్నతనం నుండి నా తల్లిదండ్రులు కాయకష్టం చేసి మమ్మల్ని పెంచి చదివించి పెద్ద చేశారు. నాకు ఉద్యోగ రావడం పట్ల నా తల్లిదండ్రులు, అన్నలు ఆనంద భాష్పాలు రాడు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. కష్టపడితే సాధించలేనిది ఏమీ ఉండదని, ప్రణాళిక బద్ధంగా సమయాన్ని కేటాయించి చదివితే ఎంతటి స్థాయికైన చేరుకోవచ్చని అన్నారు. జిల్లేపల్లి శోభన్ బాబు జిల్లేపల్లి వెంకటయ్య మైసమ్మల 3వ,సంతానం. తన మొదటి అన్న రవి, రెండవ అన్న సుమన్ లు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యాభ్యాసం చేసి గురుకుల కళాశాల ఫిజికల్ డైరెక్టర్ గా ఉద్యోగం సాధించారు. తన విద్యాభ్యాసం ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు తాడువాయి గ్రామంలోను, ఎనిమిదో తరగతి నుండి పదవ తరగతి వరకు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ మునగాల లోను, ఇంటర్మీడియట్ స్నేహ జూనియర్ కళాశాల కోదాడ, డిగ్రీ ఈవీ రెడ్డి డిగ్రీ కళాశాల కోదాడ లోను, బిపిఈడి ప్రొద్దుటూరు లోను, ఎంపీఈడి ఉస్మానియా యూనివర్సిటీ లోని అభ్యసించారు. ఎంపీడీ కోర్సు పూర్తయిన తర్వాత ఎమ్మెస్సార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి గురుకుల పాఠశాలలోనూ, గురుకుల కళాశాలలోనూ రెండింటిలోనూ రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించారు. ర్యాంకు రావడం పట్ల ఉస్మానియా యూనివర్సిటీ లో తన సహచర మిత్రులు తమ అధ్యాపకులు ప్రశంసించారు. గ్రామంలోని తన మిత్రులు,గ్రామ ప్రజలు నాయకులు, వివిధ హోదాలలో ఉద్యోగాలు సాధించిన తన గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :