Saturday, 18 April 2026 08:09:49 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

నందిగామ మండలంలో 75 మంది గిరిజనులు కాంగ్రెస్ పార్టీలో చేరిక...

Date : 10 July 2023 05:10 AM Views : 339

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : నందిగామ మండల్ : తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ సర్కార్ ఆట త్వరలో ముగుస్తుందని రాబోయేది కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమనీ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండలంలోని బండకుంట తండా, పెద్దకుంట తండా నుండి దాదాపు 75 మంది గిరిజనులు మండల పార్టీ అధ్యక్షుడు జంగ నరసింహ, ఎంపీటీసీ సభ్యులు కొమ్ము కృష్ణ, కుమారస్వామి గౌడ్, చంద్రపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్. ఈ సందర్భంగా వీళ్ళకుల శంకర్ మాట్లాడుతూ.. నేడు ఏ తండాలో చూసిన అభివృద్ధి లేకుండా గిరిజనులు ఎంతో కష్టాలు అనుభవిస్తున్నారని అన్నారు. పేరుకే తాండలను ప్రత్యేక గ్రామపంచాయతీలను చేసీనప్పటికీ అభివృద్ధి శూన్యమని అన్నారు. గిరిజన మహిళలకు ఉపాధి లేదని యువతకు ఉద్యోగాలు లేవని విచారం వ్యక్తం చేశారు. ఏ తండా కూడా సంక్షేమానికి అభివృద్ధికీ నోచుకోలేదని, సంక్షేమం లేదు అభివృద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ షాపుల్లో సరుకులు కూడా సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తండాలో తాగునీటికి సమస్య ఉందని, రోడ్డు సరిగ్గా లేవని డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదని ఆరోపించారు. పలువురు గిరిజనులు పార్టీలో చేరిన తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :