Friday, 08 May 2026 09:24:31 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

బీటీపీఎస్ లో విద్యుత్ జేఏసీ నిరసన...

Date : 27 September 2024 05:49 PM Views : 372

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రామగుండం లోని విద్యుత్ ఉత్పత్తి (1×800 MW)కేంద్రాన్ని తెలంగాణ జెన్కో నే నిర్మించాలని డిమాండ్ చేస్తూ TGPE( తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్)JAC సభ్యులు మణుగూరు లోని బీటీపీఎస్ లో గురువారం నిరసన తెలిపారు . ఈ సందర్భంగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి జేఏసీ నాయకులు ప్రసంగిస్తూ రామగుండం లో మూసివేసిన ఆర్టిఎస్ ( రామగుండం ధర్మల్ స్టేషన్ )స్థానంలో సింగరేణి, జెన్కో సంయుక్త ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం చూడటం సరైన చర్య కాదని విమర్శించారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో దశల వారి ఆందోళనను చేపట్టినట్లు హెచ్చరించారు. ఆందోళన షెడ్యూల్ ని వివరిస్తూ నేటి నుంచి ఆదివారం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియచేస్తామని చెప్పారు. అనంతరం ఈ నెల 30 వ తేదీ నుంచి వచ్చే మూడో తేదీ వరకు గేట్ మీటింగ్ లు, చివరన 4,5 వ తేదీ ల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ బిటిపిఎస్ బ్రాంచ్ అధ్యక్షులు బి. రవి ప్రసాద్, రవితేజ, సాయి, కార్మిక సంఘ -327 రీజనల్ అధ్యక్షులు బి. కృష్ణ, కార్మిక సంఘం -1535 అధ్యక్షులు వి. ప్రసాద్, సిఐటియు నాయకులు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :