సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని కింది తండా గ్రామం చెన్నై పాలెం గ్రామం పోలింగ్ స్టేషన్ నెంబర్ 114లో రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో నాలుగో రోజు కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి మీ యొక్క పవిత్రమైన ఓటును హస్తం గుర్తుకు వేయాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేసినారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాలోతు నాగు నాయక్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మాలోతు బాలు నాయక్ మాట్లాడుతూ ఈనెల 13వ తారీఖున జరుగుతున్న నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి కి ఈవీఎం లోని సీరియల్ నెంబర్ 3 ను గుర్తుంచుకొని పక్కన ఉన్న హస్తం గుర్తు పై బటన్ నొక్కి మీ అమూల్యమైన ఓటు హస్తము గుర్తుపై వేసి రాష్ట్రంలోనే అఖండ మెజార్టీ తో గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు సోదర సోదరీమణులకు కోరారు. ఈ కార్యక్రమంలో బానోతు మేఘ నాయక్ ,మాలోతు తులసి రామ్ నాయక్ ,గోలి సురేష్ ,భూక్యా డగన నాయక్ ,మాలోతు బాలు నాయక్ , సపావత్ రాములు నాయక్ ,బానోతు రాములు నాయక్, మాలోతు రాజా, బానోతు బుజ్జి ,బానోతు ప్రమీల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin