సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న రెండవ ఏన్ఎంలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుదవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం కొందుర్గు మండల కేంద్రములో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండవ ఏఎన్ఎంల రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు డి. అరుణ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డి అరుణ మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయమని ఖరాకండిగా చెప్పడం బాధాకరమని అన్నారు. మంత్రి హరీష్ రావు ఈ మాటను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 16 ఏళ్లుగా రెండవ ఏఎన్ఎంలుగా పనిచేస్తూ అన్ని జాతీయ ఆరోగ్య కార్య క్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నా మని, ప్రభుత్వం తమ సేవలను గుర్తించి తక్షణమే రెగ్యులరైజ్ చేసి తమకు ఉద్యోగ భధ్రత కల్పించాలన్నారు. సమాన పనికి సమానం వేతనంతో పాటు పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 16 నంబర్ జీవోలో చేర్చి బేసిక్ ఇవ్వాలని కోరారు. 7 సంవత్సరాల ఏరియర్స్ ఇవ్వాలని కోరారు. ఏలాంటి రాత పరీక్షలు లేకుండా ఉన్న స్థానంలోని పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో అరుణ,చంద్రకళ,సరళ, అరుణ సులోచన, జోతి, స్వాతి, సునీత, తిరుపతమ్మ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin