Monday, 14 September 2026 06:21:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన టిఆర్ఎస్ కు గట్టిగా బుద్ధి చెప్పాలి... -తెలుగుదేశం పార్టీ నేరేడుచర్ల అధ్యక్షుడు వెంకటయ్య

Date : 30 July 2023 12:17 AM Views : 199

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరి పాలనకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పాలనకు తొంభై శాతం వ్యత్యాసం ఉన్నదనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో పనిచేసిన ముఖ్యమంత్ర్రులు అందరు కలిపి చేసిన అప్పుల కన్నా మిగులు బడ్జెట్ తో బాధ్యతలు ప్రజలు అప్పజెప్పితే తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అప్పులు మూడు రెట్లు ఎక్కువగా చేశారనీ కానీ ఆచరణలో అభివృద్ధి మాత్రం కంటికి కనబడనంత దూరంలో ఉన్నదనీ , రాబోయే రోజుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుటయే గాక పేదలకు , ధనికులకు మధ్య ఆకలి పోరాటాలు, దారిదోపిడీలు జరిగే అవకాశం ఉందని దానికి , తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యులనీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు , నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షుడు ఇంజమూరి వెంకటయ్య ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నామ మాత్రపు ఉచిత పథకాలతో , గారడీ మాటలతో ప్రజలను గుడ్డిగా నమ్మించారనీ , రాబోయే కాలంలో అట్టి పథకాలకు నిధులు లేక రాబోయే రోజుల్లో కాబోయే ప్రభుత్వాలు వాటిని ఎత్తివేస్తే ఉచితాలకు అలవాటు పడిన ప్రజల జీవనశైలి అగమ్యగోచరంగా మారుతోందని , ప్రజలకు శాశ్వత ఉపాధి మార్గాలను చూపాల్సిన ప్రభుత్వాలు వారి పదవీ కాంక్షతో అమలుగాని వాగ్దానాలు చేసి , రాష్ట్ర ఖజానా దివాలా తీయించి అప్పుల పాలు చేశారని వారు ఆవేధన వ్యక్తం చేశారు . గత పాలకులు ఎదేనీ నూతన చట్టం అమలు చేసే సందర్భంలో అన్ని పార్టీల సలహాలు , సూచనలు తీసుకునేవారని , కానీ కేసీఆర్ పాలన రాజరిక పాలన వలే చేసి నిరుద్యోగుల , యువత భవిష్యత్తు నాశనం చేశారని , ప్రజలు బంగారు తెలంగాణ అంటే ఎలాగుంటదో అని ఆశతో ఎదురు చూస్తే , బాధల తెలంగాణ గా తయారుచేశారనీ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండదు , టిఆర్ఎస్ పార్టీ ఉండదనీ వారు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పాలకవీడు మండల పార్టీ అధ్యక్షుడు కొనకంచి సైదులు , పార్టీ కార్యదర్శి నెమ్మాది సుందరయ్య , షేక్ సత్తార్ , నల్లమేకల యలమంద పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: