సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : రైతులు పండించిన పత్తికి కనీస మద్దతు ధర ఎమ్మెల్యే సత్యనారాయణ సర్కార్ న్యూస్ రైతులెవరూ ప్రైవేటు వ్యక్తులకు పత్తిని అమ్ముకుని నష్టపోవద్దు సీసీఐ కేంద్రాల్లోనే రైతులు పండించిన పత్తికి మద్దతు.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రైతులెవరూ ప్రైవేటు వ్యక్తులకు పత్తిని అమ్ముకుని నష్టపోవద్దని, సీసీఐ కేంద్రాల్లోనే రైతులు పండించిన పత్తికి కనీస మద్దతు ధర లభిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. చిట్యాల శివారులోని శ్రీ బాలమురుగన్ ఇండస్ట్రీస్ కాటన్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... సీసీఐ కొనుగోలు కేంద్రంలో ప్రైవేట్ వ్యాపారులను ప్రోత్సాహించవద్దని, బయ్యర్ మాత్రమే మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు పండించిన పత్తిని సీసీఐ కేంద్రాలకు తెచ్చే ముందు తేమ లేకుండా ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలంటే తప్పనిసరిగా కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు. సీసీఐ కేంద్రాల్లో రైతులకు సరిపడ వసతులు కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
-----------------------
Reporter