సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం కొండాయిలుపల్లి గ్రామం లో యువ పరివర్త న్( ఎన్జీవో) (కేరవాడి సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్) ముంబై వారి సహకారంతో కొండేయిలుపల్లి గ్రామంలోని మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ తరగతులను నర్సంపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో సోమవారం రోజున ప్రారంభించడం జరిగినది.ఇట్టి కార్యక్రమానికి పంచాయితీ కార్యదర్శి రజిత , నర్సంపేట యువ పరివర్తన మేనేజర్ రొట్టె సురేష్ మొబైలైజర్ ,అడ్డ సతీష్ , కుట్టు మిషన్ ట్రైనర్ ,జి ప్రియాంక హాజరై నారు.యువ పరివర్తన నర్సంపేట మేనేజర్ సురేష్ మాట్లాడుతూ మహిళలకు 45 రోజులపాటు కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ఇవ్వడం జరుగుతుంది. అనంతరం దీనికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంధని దీనిని ఒక మంచి అవకాశం పరిగణించి మహిళలు శిక్షణ తీసుకొని ఆదర్శంగా ఉండాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి రజిత మాట్లాడుతూ మహిళలు తలుచుకుంటే సాధ్యం కాని పని ఏమీ ఉండదు. మీరు తప్పకుండా శిక్షణ తీసుకొని గ్రామానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. మహిళా సంఘం సీఎ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మా గ్రామంలో మహిళలు ఒక మంచి అవకాశం ను వినియోగించుకుంటారని అన్నారు. మొబలైజ్ ర్ అడ్డ సతీష్ మాట్లాడుతూ యువ పరివర్తన సంస్థలో కంప్యూటర్, నర్సింగ్, బ్యూటిషన్, ఎలక్ట్రిషన్, సేల్స్ తో పాటు అనేక రకాల శిక్షణ ఇవ్వబడును. కావున పదవ తరగతి చదివి ఆపై చదువులు చదవలేక ఇబ్బంది పడుతున్న వారికి యువ పరివర్తన సంస్థ ద్వారా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించబడనని తెలిపారు. గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభానికి సహకరించిన మహిళా సంఘం సీఏ పొన్నం వెంకటేశ్వర్లు కు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళలు,గ్రామస్తులుహాజరు కావడం జరిగినది...
-----------------------
Admin