సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ టిబి యూనిట్ లో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. 30 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు సర్వ ప్రేమ వెల్ఫేర్ సొసైటీ దాతల సహకారంతో పౌష్టికాహారం కిట్లను సమకూర్చగా.. Dy Dmho డాక్టర్ యాకూబ్ పాషా గారు, జిల్లా క్షయ నివారణా అధికారి డాక్టర్ హిమబిందు గారు, డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు, who కన్సల్టెంట్ డాక్టర్ ఉష్మా గారు మరియు సర్వప్రేమా వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ బాలస్వామి రెడ్డి గారు పంపిణీ చేశారు. పౌష్టికాహార లోపం కారణంగా క్షయవ్యాధి ఆలస్యంగా తగ్గే అవకాశమున్నందున స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు మరియు పౌరులు ముందుకు వచ్చి టీబీ రోగులకు చేదోడుగా నిలబడాలని కోరారు. రోగులకు ఫుడ్ కిట్స్ అందించేందుకు చొరవ చూపిన సర్వప్రేమ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులను డిప్యూటీ Dmho యాకూబ్ పాషా గారు మరియు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ హిమబిందు గారు అభినందిం చారు. కార్యక్రమంలో సర్వప్రేమ వెల్ఫేర్ సొసైటీ కార్య నిర్వాహక సభ్యులు, ఉద్యోగులు,జిల్లా టీబీ కో-ఆర్డినేటర్ కిరణ్ కుమార్, హనుమకొండ టిబి సూపరవైజర్ విజయ్ కుమార్ మరియు జిల్లా టిబి నియంత్రణ విభాగ సిబ్బంది పాల్గొన్నారు...
-----------------------
Admin