సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రాష్ట్రంలో రెండు దఫాల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం విధ్వంసమై విద్యార్థుల భవిష్యత్ అంధకారమైందనీ బిజెపి షాద్ నగర్ కన్వీనర్ డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్ విమర్శించారు. మంగళవారం ఏబీవీపీ నాయకుడు పుట్నాల సాయికుమార్ ఆధ్వర్యంలో ఏబీవీపీ కదన భేరి కార్యక్రమాన్ని బిజెపి కన్వీనర్ డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, ఏపీ మిథున్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్వీనర్ డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. పాఠశాల నుండి యూనివర్సిటీ స్థాయి వరకు అడుగడుగునా ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో జరిగిన నష్టం సమీప భవిష్యత్తులో భర్తీ చేయలేనిదనీ ధ్వజమెత్తారు. ఈ దశాబ్ద కాలంలో ప్రభుత్వం విద్యారంగానికి అరకొర బడ్జెట్ కేటాయింపులు, బోధన, బోధనేతర నియామకాల భర్తీలో అలవిమాలిన అలసత్వం, మౌలిక వసతుల కొరత ఇలా పలు అంశాల్లో ప్రభుత్వ అలసత్వం తెలంగాణ విద్యార్థుల పట్ల శాపమైందనీ అన్నారు. ఉద్యమ సమయంలో నాణ్యమైన విద్యా అంటూ నినదించి, అధికార పీఠమెక్కాక. కేజీ టూ పీజీ ఉచిత విద్య అని ప్రకటించి, అందుకు పూర్తి విరుద్ధంగా కేజీ టూ పీజీ వరకు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తూ విద్యా రంగాన్ని కార్పొరేట్ వశం చేసి. దేశంలోనే విద్యాసంస్థలకు తెలంగాణ లాభసాటిగా మార్చారనీ విమర్శించారు.
-----------------------
Admin