సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు జెడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి సహకారంతో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొత్తం 41మంది మహిళలు పాల్గొనగ, మొదటి బహుమతిగా అక్షిత రూ.3016, రెండవ బహుమతి కావ్య రూ.2016, మూడో బహుమతి రూ.1016 అందజేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ టిఫిన్ బాక్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజుల బాల్ నర్స్ గౌడ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సద్ది రాజిరెడ్డి, పండరి రాజా లక్ష్మణరావు ,బాబు ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin