సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రూ 17 వేలకే 400 ఆపరేషన్లు పూర్తిచేసిన డాక్టర్ బిందుపల్లవి కొత్తగూడెం మే 1 ప్రముఖ ప్రసూతి సంతాన సాఫల్య వైద్యురాలు బిందుపల్లవి సేవే లక్ష్యంగా ఉచిత ఓపి,హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి మన్ననలు పొందుతున్నారు. రూ.17 వేలకే ఆపరేషన్లను చేస్తున్నారు.అత్యంత తక్కువకి ఖరీదైన క్లిష్టమైన ఆపరేషన్లు స్వల్ప కాలంలో బిందుపల్లవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో 400 ఆపరేషన్లను డాక్టర్ బిందుపల్లవి విజయవంతంగా పూర్తి చేశారు.ఈ సందర్భంగా ఆమె హాస్పిటల్లో గురువారం సిబ్బంది,కుటుంబ సభ్యులు, పేషెంట్లతో,కలిసి కేక్ కట్ చేశారు. సంతాన సేఫల్యంలోనూ బిందుపల్లవి మంచి ఫలితాలు సాధిస్తున్నారు.సేవ సంతోషాన్నిస్తుందని ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆమె అన్నారు. సర్కార్ టీవీ ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం షేక్ ఆసిఫ్
-----------------------
Reporter