సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ గాంధీనగర్ 35వ.వార్డ్ కు చెందిన నిరుపేద కుటుంబం దాసరి.సతీష్, స్వప్న వారి యొక్క పురి గుడిస షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధం అవ్వడం జరిగింది.విషయం తెలుసుకున్న జనయేత్రీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మునిర్ అహ్మద్ షరీఫ్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించిన విచారం వ్యక్తం చేసి వెంటనే 25కేజీ ల బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. మీకు మేము అండగా ఉంటానని పూర్తి మూడు రోజుల తరువాత జనయేత్రీ గ్రూప్ ద్వారా వారికి 20000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి స్టీల్ సామాన్లు జనయేత్రి ఫౌండేషన్ ఆఫీసులో వారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మునీర్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ మన పరిసర ప్రాంతాలను ప్రతి ఒక్కరికి, ప్రమాద సమయంలో, చేయూతనివ్వాలని, ప్రతి ఒక్కరు మానవత దృక్పథం కలిగిన ఉండాలని కోరారు. నా యొక్క అభినందనలు మీ సహాయ సహకారాలు ఇలాగే ఉంటే రాబోయే కాలంలో ఇలాంటి వారిని ఇంకా కొంతమందిని ఆదుకోవడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షులు దైద శ్రీనివాస్ శివ కిరణ్, రోహిత్ ,సందీప్ నల్లగొండ జిల్లా జన యోత్రి సభ్యులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin