Friday, 08 May 2026 10:37:52 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

రుణమాఫీ ఒకే విడతలో వెంటనే అమలు చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు ...

Date : 27 June 2023 02:17 AM Views : 416

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మోతే : బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన రూ. లక్ష రుణమాఫీని ఒకే విడత లో వెంటనే అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు .బిఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వం నేటికీ రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీలు పెరిగి రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ కాకపోవడంతో రైతాంగానికి కొత్తగా రుణాలు బ్యాంకులు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 2018లో రైతులకు రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించిందన్నారు. ఈ రుణమాఫీని 4 వార్షిక విడతల్లో మాఫీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారని తెలిపారు. 2014 ఏప్రిల్ ఒకటి నుండి 2018 డిసెంబర్ 11 మధ్య రుణం పొందిన వారికి రూ.21,557 కోట్లు మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారన్నారు. మొదటి విడత 25 వేల లోపు రుణం5.83 లక్షల మంది రైతులకు1,198 కోట్లు ఇచ్చి ఒకే విడత రుణమాఫీ చేయడంతో పాటు మిగిలిన రుణం నాలుగో విడతలు మాఫీ చేయబోతున్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు. 50 వేల లోపు రుణాలు ప్రభుత్వ నిధులు జమ చేసిందని 2018 -19 నుండి 2023- 24 వరకు బడ్జెట్ లో గాని రివైజ్డ్ చేసిన బడ్జెట్ తో సహా రూ.16,261 ఓట్లు కేటాయించిందన్నారు. ప్రభుత్వం చెప్పిన ఐదవ విడత రెండువేల 23 -24 తో ముగిసిపోతుందని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఉన్న రైతుల రుణమాఫీ బాకీ కి ఒకే విడత గా ప్రభుత్వం విడుదల చేసి రైతులను రుణముక్తిని చేయాలని కోరారు. ప్రస్తుతం బ్యాంకులో రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. వారి రుణాలను తిరగరాసి బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారని తెలిపారు. రైతులు వారి అంచనా ప్రకారం 20వేల కోట్ల అధిక వడ్డీలకు ప్రైవేటు రుణాలు తెచ్చి వ్యవసాయలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మాఫీలో మొత్తం 40.66 లక్షల మంది రైతులు రూ.21,557 ఓట్లు వాకి ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించిందన్నారు. ప్రభుత్వం గుర్తించిన మేరకు రైతుల రుణమాఫీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా వ్యవసాయం కోసం నగలు తాకట్టు పెట్టిన వారికి కూడా లక్ష లోపు మాఫీ చేస్తామని ప్రభుత్వం జీవోలో పేర్కొందని దాన్ని అమలు చేయాలని కోరారు. వానాకాలం పంట సాగు చేస్తున్న వారికి రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: