సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువులో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఓ.డి చెరువు శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా స్థాయిలో యం.అరుణ్ కుమార్ 586, యస్.ఫర్జానా 580, సి. షమీం తాజ్ 577, పి.సిందూర 575, జె.లిఖిత 563, బి.లోహిత 563, అత్యధిక మార్కులు సాధించారు. 550 పైన 9మంది, 500 పైన 18 మంది, 450 పైన 30 మంది, 400 పైన 42 మంది విద్యార్థినీ విద్యార్థులు మార్కులు సాధించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ కే.మస్తాన్ మాట్లాడుతూ ఈ విజయానికి కారణం అయిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు విద్యార్థినీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో67 మందికి గాను సి ఎం ప్రవీణ్ కుమార్ 583 మార్కులు, పి మా ఇష్టం. ఇస్తాతన్577 మార్కులు, ఎస్ హారిత573 మార్కులు, ఆర్ భరత్ నాయక్ 570 మార్కులు, 500 మార్కులు పైకి 30 మంది ఉత్తీర్ణులైనారు మిగతావారు కూడా ఉత్తీనులయ్యారని కరస్పాండెడ్ ఎం. ఫక్రుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఎం ఫక్రుద్దీన్ మాట్లాడుతూ ఈ విజయానికి కారణం అయిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రుల కు యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలోని 6 జిల్లా పరిషత్ హై స్కూలు నందు 0 మండల విద్యాధికారి ఖాదర్ వలీ భాష తెలిపిన వివరాల మేరకు ఒడిసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 118 పరీక్ష రాయగా 34 మంది ఉత్తీర్ణులయ్యారు. తంగేడు కుoట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 36 మంది విద్యార్థులకు 14 మంది పాసయ్యారు. మిట్టపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 57 మంది విద్యార్థులకు 14 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కొండకమర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంద మంది విద్యార్థులు పరీక్ష రాయగా 29 మంది పాసయ్యారు. గౌనిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 102 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 27 మంది విద్యార్థులు పాస్, టీ కుంట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 38 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 21 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు.
-----------------------
Admin