సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : ఈనెల 13 వ తేదీన జరిగే ఉపాద్యాయ శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని డీసీసీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి ఉపాధ్యాయులను కోరారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి నుండి ఉద్యోగులకు అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉందన్నారు. ఉపాధ్యాయుల సమస్య ల కోసం పోరాటం చేస్తున్నా గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో ఓటేసి గెలిపించాలన్నారు. ఎన్నికల బరిలో ఉన్న ఇరవై ఒకటి మందిలో ఉపాధ్యాయుల సమస్యలపై కొట్లాడింది ఒక్క గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఒక్కడేనని, భవిష్యత్తులో ఉపాధ్యాయుల సమస్యల సాధనకు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈసమావేశంలో టీపీసీసీ సభ్యులు వార్ల విజయ్ కుమార్, మాజీ జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎండి.గౌస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి.సుధాకర్, మాజీ ఎంపిపి సదాశివరెడ్డి, కౌన్సిలర్ ఎండి.సలీం, మద్దూర్ మండల అధ్యక్షుడు జి.నర్సిములు, కోస్గి రఘువర్ధన్ రెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin