సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ మండల పరిధిలో గల కురుమాల , గంగాపురం గ్రామాలలో ఆదివారం వైసీపీ సి ఈ సి సభ్యులు కొత్తకోట సోమశేఖర్ రెడ్డి, కుమారుడు చక్రధర్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో ప్రజలు ఆయనకు హారతితో ఘనస్వాగతం పలికి పూల వర్షం కురిపించారు. సోమశేఖర్ రెడ్డి ప్రతి ఇంటి వద్దకు వెళ్లి రాబోయే 2024 ఎన్నికలలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోనీ ప్రజలు మాట్లాడుతూ. 2013 లో కరువుతో అల్లాడుతున్న మా గ్రామంలో నీళ్లు లేక మా గ్రామ ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మాకు నీళ్లు లేవని సోమశేఖర్ రెడ్డికి విన్నవించుకోగా తక్షణమే ఆయన స్పందించి తన సొంత ఖర్చులతో వెంటనే బోరు వేయించి నీరు మా గ్రామానికి అందించే విధంగా కృషి చేశారనీ ప్రజలు పేర్కొన్నారు ఒక్క కురుమాల గ్రామంలోనే గాక పుట్టపర్తి నియోజకవర్గంలో నీళ్లతో ఇబ్బందులు పడుతున్న అనేక గ్రామాల్లో అప్పటిలో తన సొంత ఖర్చులతో బోర్లు వేయించి దాహార్తిని తీర్చిన ఘనత ఒక సోమశేఖర్ రెడ్డికే దక్కుతుందని ప్రజలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కురుమాల వైసిపి నాయకులు , మాజీ సర్పంచ్ రెడ్డప్ప , రవిచంద్రారెడ్డి, మాజీ విఆర్ఓ కేశవరెడ్డి , మాజీ డీలర్ గిరిజాపతి , ఎంపీటీసీ రామప్ప , హబీబ్ ఉల్లా , రంగప్ప ,వెంకటరాముడు, రమణప్ప , గంగాపురం మదనమోహన్ రెడ్డి ,శంకర , రవిప్రకాష్ ,రామిరెడ్డి , డీలర్ రాజారెడ్డి , వంకరకుంట వైసిపి నాయకులు రమేష్ , షాలీస్ ,పవన్ , రఫీ, రమణ , తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin