సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కల్వపల్లి గ్రామంలో ప్రజలందరు ఏకమై పండుగ చేసుకోవాలి మా గ్రామనికి బొడ్రాయి ఏర్పాటు చేసుకోవాలి దానికి సహాయం చేయండి అని కొద్ది రోజుల క్రితం పిల్లుట్ల రఘు ని కలిసి అడిగిన వెంటనే స్పందించి, మీ గ్రామానికి నేను అండగా ఉంటా పార్టీలకు అతీతంగా మీరందరూ చక్కటి వాతావరణం లో పండుగ చేసుకోవాలి అని వాళ్ళకి సూచించి ఇచ్చిన మాట ప్రకారం గత మూడు రోజులుగా గ్రామంలో అంగ రంగ వైభవంగా పండుగ చేసేలా చేశాడు అయ్యగార్ల ఖర్చు నాదే అని చెప్పి దాదాపు 3లక్షల నుండి 4 లక్షల వరకు అయ్యగార్లకు అందించి ఇచ్చిన మాట ప్రకారం గత మూడు రోజులుగా వేద మంత్రాలతో పూజలు నిర్వహిస్తున్నారు. బొడ్రాయి ధ్వజస్తంభం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గం వాస్తవ్యులు పిల్లుట్ల రఘు ని జనసంద్రోహం మధ్య తీసుకువచ్చి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రత్యేక పూజలు రఘు చేతుల మీదుగా చేయించి ధ్వజ స్తంభం బొడ్రాయి రాముల వారి విగ్రహాలు ప్రతిష్టించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించి చుట్టుపక్కల నుండి వచ్చిన వేలాది మంది భక్త మహాశయులకు అన్నప్రసాదం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రఘున్న మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నో దేవాలయాలకు మరియు గ్రామాలలో బొడ్రాయి పండుగలకు ధ్వజ స్థంభం పండుగలకు సహకారం అందించామని వేలాది మంది యువతకు ఉచిత కోచింగ్ ఏర్పాటు చేశామని రాబోయే రోజుల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడండి పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని నియోజకవర్గంలో నిరుపేద కుటుంబం అనేది లేకుండా చేస్తామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఇంచార్జీ కుక్కల వెంకన్న, కాకునూరి శివారెడ్డి ,, వీర్ల అంజి గ్రామ పెద్దలు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin