సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలం లోని యాతవాకిళ్ళ గ్రామంలో గ్రామస్తులందరూ రఘు కు ఘన స్వాగతం పలకగా పిల్లుట్ల రఘు తన తల్లిదండ్రులు వీరయ్య,గౌరమ్మ దీవెనలు తీసుకొని నిజమైన స్థానికుడిగా నిస్వార్థ సేవకుడిగా ప్రజలందరూ తనను ఆదరించాలని కోరారు. అన్ని గ్రామాల్లోనే కాక తన సొంత గ్రామంలో కూడా అనేక మందికి విద్య, వైద్య, ఆర్థికంగా ఆదుకుంటూ అనేక సంవత్సరాల నుంచి ఉన్న పాఠశాలలను, దేవాలయాలను మరల పునరుద్వించిన ఘనత తనదే అని అన్నారు.నియోజక వర్గంలో అనేక పండుగలకు కులమత బేధం లేకుండా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ,అన్నదానాలు నిర్వహిస్తూ. హిందూ,ముస్లిం క్రిస్టియన్,మైనార్టీలు, అగ్రవర్ణాల వారందరినీ ఒక తాటిపై తీసుకువచ్చిన ఘనత తనదేనని తెలిపారు. అలాగే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సాక్షిగా హుజూర్ నగర్ నియోజకవర్గం లోని ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్న తను దృష్టికి వస్తే తీరుస్తానని తెలిపారు ప్రజలందరూ ఒకసారి ఆలోచించి సింహం గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజవర్గంలో ఏ నాయకుడు చేయలేని పనులు తాను గొప్పగా చేసి నిరూపిస్తానని పిల్లుట్ల రఘు తెలిపారు.పార్టీలన్నీ ఒక్కటైనా మంచి మనసున్న తన లాంటి వారిని ప్రజలు ఆదరిస్తారని తెలిపారు.సింగిల్ గా సింహం గుర్తుతో వచ్చి, ఓటమి లేని నాయకుడు స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మార్గమే ధ్యేయంగా ఎమ్మెల్యే గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామస్తులు,రఘున్న అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin