సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసిన గౌడ సంఘం నూతన కార్యవర్గం నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి ని నర్సంపేట గౌడ పారిశ్రామిక సంఘం నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నర్సంపేట గౌడ పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 4వ తారీఖు నుండి ఏడో తారీఖు వరకు నిర్వహించే శ్రీ కంఠమహేశ్వర స్వామి సూరమాంబ ఎల్లమ్మ వనం మైసమ్మ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు, అనంతరం కంఠమహేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే రోడ్డు నిర్మాణం పనులను చేయించాలని కోరడంతో తక్షణమే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోలా వెంకటేశ్వర్లు గౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల సదానందం, మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, కోశాధికారి గిరిగాని కిరణ్ కుమార్ డైరెక్టర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, గిరిగాని మొగిలి, కోయడి కిరణ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు వేముల సారంగం గౌడ్, కుల పెద్దలు చుక్క కనకయ్య, వేముల ఆయిల్ సమ్మయ్య, గండు స్వామి, దొమ్మటి కుమారస్వామి కుల సంఘం సభ్యులందరూ పాల్గొన్నారు.
-----------------------
Reporter