సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్, కో కన్వీనర్లను నియమించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ గోళ్ళ శ్రావణ్ రెడ్డి తో పాటు కో కన్వీనర్లు సాయి ప్రవల్లిక, రాజు,జిలాన్, ప్రసాద్ లు శనివారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరింత ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని మరోమారు అధికారంలోకి తేవడానికి మరింత కృషి చేయాలని సూచించారు.
-----------------------
Admin