Wednesday, 29 July 2026 05:14:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేసి ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలి...

Date : 30 January 2024 05:22 PM Views : 216

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నాగార్జునసాగర్ ప్రాజెక్టు లో 520 అడుగుల నీళ్లు ఉండి కూడా ఆయకట్టు పరిధిలో వేసిన పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం చూసీ చూడనట్లుగా ఉండటం కరెక్ట్ కాదని వెంటనే నీటిని విడిచి ఎండుతున్న పంటలను కాపాడాలని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గరిడేపల్లి మండల కేంద్రంలో జరిగిన సిపిఐ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నీళ్లు ఇస్తుందనే ఆశతో ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఖర్చు చేసి పంటలు వేసుకున్నారని ఇప్పటి వరకు బావులు, బోర్ల తో పంటలు తడుపుకున్నారాని, రాను, రాను బూగర్భ జలాలు అడగంటం తో, బావులు ఎండిపోయినాయని, బోర్లు మొత్తం తగ్గి వేసిన పంటలు ఎండిపోవుచున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న గాక మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కూడా సాగర్ నుండి ఐదు టి ఎం సి ల నీటిని పది రోజులు తీసుకున్నారని, అయినా తెలంగాణా పెద్దలు మనకు కూడా నీళ్లు కావాలని కోరక పోవడం అన్యాయం అని ఆయన అన్నారు.సాగర్ ఆయకట్టు పరిధిలో చెర్వులు, కుంటలు, బావులు మొత్తం ఎండిపోయినాయని, వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, పంటలు ఎండితే పశువులకు కూడా మేత కరువు అవుతుందని ఆయన అన్నారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు త్రిపురం సుధాకర్ రెడ్డి, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు యడ్ల అంజిరెడ్డి, ఏ ఐ వై ఎఫ్ నాయకులు మెండే లింగరాజు, చామకూరి కాశయ్య, శొంఠి వెంకన్న, యాసరపు పున్నయ్య,ప్రధాని సైదులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :