సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండలం కిసాన్ నగర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం రోజున పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.1975-85 వరకు 10 సం,, రాల ఎస్ఎస్సి బ్యాచ్లకు చెందిన విద్యార్థులు తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను మెమొంటో శాలువాలతో ఘనంగా సన్మానించారు. అప్పటి ప్రధానోపాధ్యాయులు గంగాధర్ గౌడ్ ఉపాధ్యాయులు రంగాచారి , వెస్లీ, తిరుపతి రెడ్డి ,పుష్ప నాథ్ రెడ్డి, ఇన్నయ్యగంగారెడ్డి ,సుదర్శన్ రెడ్డి ,జగదీశ్వర్ రెడ్డి ,ఎం రాజేశ్వర్ రెడ్డి ,సాగర్ రెడ్డి ,గంగాధర్ ,పోతూ సార్ తదితరులను పూర్వ విద్యార్థులైన ప్రస్తుతం హైదరాబాదులో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ లింగమూర్తి నిమ్స్ సూపరిండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ ,డాక్టర్ ఆనందం ,తాసిల్దార్ జయంత్ రెడ్డి తదితరులు సన్మానించారు .అప్పటి మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు ఏంపాల సుదర్శన్ ,ఎస్ కే రహీముద్దీన్ ,మనోహర్ ,ప్రసాద్, రాజారామ్ ,సాయన్న , మహమ్మద్ హుస్సేన్, మాలిక్, ఏక్ బాల్, విజయానంద్ ,దాసరి వెంకటేష్ మల్లయ్య, హనుమాన్లు, దేవ సాయం ,విజయ రావు, రాజేందర్ ,దేవిదాస్, మహేందర్,సురేందర్ ,తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు...
-----------------------
Admin