సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టడంలోనే దైవత్వం ఉందని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.స్థానిక మధురబస్తీలోని లక్ష్మిగణపతి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా జిల్లాలో జరిగిన గణపతి నవరాత్రి ఉత్సవాలు సమైక్యతకు,సౌబ్రాతృత్వానికి నిదర్శనంగా నిలిచాయని అన్నారు.ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టడంలోనే దైవత్వం ఉందని గుర్తు చేశారు.ప్రతి మత గ్రంథంలోనూ అంతర్లీనంగా ఇదే అంశం చెప్పబడి ఉందని అన్నారు పేదవారికి ఆకలితో ఉన్నవారికి రోగులకు సహాయం చేస్తే దైవ సేవ చేసినట్లేనని అన్నారు.అందుకే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అని కూడా అంటారని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో లింగేష్,నాత కుమారస్వామి,ఈశ్వర్,అర్వా విజయ్,నాగేందర్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin